Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యప్ప భక్తులకు ఓ గుడ్ న్యూస్.. పంచామృతం ఇక ఇంటికే..!

అయ్యప్ప భక్తులకు ఓ గుడ్ న్యూస్.. పంచామృతం ఇక ఇంటికే..!
, శనివారం, 7 నవంబరు 2020 (11:32 IST)
అవును.. అయ్యప్ప ప్రసాదం ఇక ఇంటికే రానుంది. శబరిమల ఆలయానికి ఎంతో మంది అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు అందరూ స్వామివారిని దర్శించుకొని తమ దీక్షను విరమించడానికి వెళుతూ ఉంటారు. దీంతో శబరిమలలో ఉన్న అయ్యప్పస్వామి వారి ఆలయం కొన్ని రోజులే తెరుచుకుని వుంటుంది. 
 
అయినప్పటికీ అక్కడ భక్తులు మాత్రం కోట్లల్లో తరలివస్తుంటారు. అయితే శబరిమల ఆలయంలో ప్రసాదం ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమల ఆలయ ప్రసాదం పంపిణీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు భక్తుల్లో నెలకొన్నాయి.
 
దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న శబరిమల ఆలయ నిర్వాహకులు భక్తులందరికీ శుభవార్త చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేవస్థానం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించింది. పోస్టు ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందిస్తామంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుండగా.. అప్పటి నుంచే ప్రసాదాన్ని కూడా పోస్టు ద్వారా అందించేందుకు నిర్ణయించామంటూ చెప్పుకొచ్చారు ఆలయ నిర్వాహకులు. అయితే కేరళ రాష్ట్ర వాసులకు అయితే రెండు రోజులు ఇతర రాష్ట్రాల వాసులకు అయితే వారం రోజుల సమయంలో ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చకచకా పోలవరం నిర్మాణ పనులు.. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో..?