Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా మరణాలు 51 - పాజిటివ్ కేసులు 6235

Andhra Pradesh
Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది. తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 2,996, చిత్తూరు 6,906, ఈస్ట్ గోదావరి 12,134, గుంటూరు 6,418, కడప 3,569, కృష్ణ 2,849, కర్నూలు 2,868, నెల్లూరు 2,757, ప్రకాశం 10,935. శ్రీకాకుళం 5,205, విశాఖపట్టణం 4,206, విజయనగరం 6,876, వెస్ట్ గోదావరి 6,899 చొప్పున మొత్తం 7,4518 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments