ఆంధ్రాలో కరోనా మరణాలు 51 - పాజిటివ్ కేసులు 6235

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది. తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 2,996, చిత్తూరు 6,906, ఈస్ట్ గోదావరి 12,134, గుంటూరు 6,418, కడప 3,569, కృష్ణ 2,849, కర్నూలు 2,868, నెల్లూరు 2,757, ప్రకాశం 10,935. శ్రీకాకుళం 5,205, విశాఖపట్టణం 4,206, విజయనగరం 6,876, వెస్ట్ గోదావరి 6,899 చొప్పున మొత్తం 7,4518 కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

ఇండస్ట్రీలో చీకటి కోణాలు అనేకం.. మగాడు టచ్‌ చేయగానే ఆడపిల్లకి అర్థమైపోతుంది : సింగర్ సునీత

Balakrishna: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో అమరావతిలో చిత్ర పరిశ్రమకు కట్టుబడి ఉన్నాం

Sukumar: ఇడుపు కాయితం తెలంగాణ నేపథ్యమైనా గ్లోబల్ స్థాయి సినిమా.: ప్రియదర్శి

Nithiin: ఇట్స్ లైఫ్ బ్రో” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నితిన్‌

తర్వాతి కథనం
Show comments