Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో కరోనా విజృంభణ: 24 గంటల్లో 86,961 కేసులు.. 1,130 మంది మృతి

భారత్‌లో కరోనా విజృంభణ: 24 గంటల్లో 86,961 కేసులు.. 1,130 మంది మృతి
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:18 IST)
భారత్‌లో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 86,961 కొత్త కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు 1,130 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 54,87,581కి చేరింది. ఇప్పటివరకు 87,882 మంది కరోనాబారినపడి మృతి చెందారు. 
 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10,03,299 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని దాదాపు 44లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 7,31,534 మందికి కరోనా పరీక్షలు చేశామని ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సోమవారం రాష్ట్రంలో 1,302 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608 కు చేరుకుంది. 
 
ఇక కరోనాతో తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1042కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రిలో కాకుండా హోమ్ ఐసోలేషన్ లో 22,990 మంది చికిత్స తీసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!