Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!

కరోనా కాలం.. కోడిగుడ్లు, చికెన్ ధరలు పైపైకి..!
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:10 IST)
కరోనా కాలంలో ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు చెప్తున్నారు. దీంతో ప్రోటిన్‌లు ఎక్కువగా లభించే గుడ్లు, చికెన్‌ ఎక్కువగా తినడంతో వీటికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్‌, గుడ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి.. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలు సామాన్యడికి చుక్కలు చూపిస్తున్నాయి. 
 
మొన్నటి వరకు 150 రూపాయలు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు 250-280 రూపాయల వరకు పెరిగింది. కోడి గుడ్ల ధర కూడా ఒక్కోటి హోల్ సేల్‌గా అయితే 6 రూపాయలు, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుంది. అదేవిధంగా డజను కోడిగుడ్లు ఎన్నడూ లేని విధంగా 165 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. 
 
సాధారణంగా వేసవిలో చికెన్, కోడి గుడ్ల ధరలు పెరిగేవి... కానీ, వర్షాకాలంలో అన్ సీజన్‌లో కూడా నాన్ వెజ్ ధరలు పెరగడంతో అటు వ్యాపారాలు లేక విక్రయదారులు, ఇటు కొనుగోలు దారులు రెండు కేటగిరిలు వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీ కడుపును కోసిన కసాయి భర్త.. ఎందుకో తెలుసా?