Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ.. కొత్తగా 8,218 కేసులు

Advertiesment
COVID-19
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 6,17,776కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 5,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం ఏపీలో 81,763 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 5,30,0711 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 74,595 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50.33 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
 
కొత్తగా చిత్తూరు 9, కృష్ణా జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం 4, విశాఖ 4, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడితో ఆ సంబంధం మానుకోమన్నందుకు భర్తను సెల్ ఫోన్ ఛార్జర్ వైరును గొంతుకు చుట్టి...