Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆ మూడు జిల్లాలలో కరోనావైరస్ ఉధృతి... ప్రజలే లాక్‌డౌన్ విధించుకుంటున్నారు...

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (14:22 IST)
ఆంధ్రప్రదేశ్ నందు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కరోనా కేసులు అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్నకొద్దీ  కేసులు కూడా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు పెరిగాయి. ఈ మహమ్మారి నియంత్రణకు జగన్ సర్కారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నది.
 
కొన్ని జిల్లాలో ప్రజలు స్వయంగా లాక్డౌన్ కూడా విధించుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,711 ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 884 మంది మరణించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి... ఈ మూడు జిల్లాలలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది.
 
పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కరోనా 10 వేల మార్కును దాటింది. ప్రస్తుతం అక్కడ 10,038 కరోనా కేసులు ఉండగా 96 మంది మరణించారు. ఇక్కడ 6786 యాక్టివ్ కేసులు ఉండగా 3156 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గుంటూరులో 8701 పాజిటివ్ కేసులు నమోదు కాగా 142 మంది మరణించారు. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments