Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్ జైలు ఖైదీలపై కరోనా పంజా, 120 మందికి కరోనా పాజిటివ్

ఉత్తరప్రదేశ్ జైలు ఖైదీలపై కరోనా పంజా, 120 మందికి కరోనా పాజిటివ్
, శుక్రవారం, 24 జులై 2020 (14:13 IST)
కరోనాకు చిన్నాపెద్ద తేడా తెలియదు. జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భరతం పడుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైలులో ఉంటున్న ఖైదీలకు కరోనా అధిక సంఖ్యలో సోకింది. దీంతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వారందర్ని ప్రత్యేక క్వారంటైన్‌కు పంపి ఊపిరి పీల్చుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది భారత్. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య మాత్రము పెరుగుతున్నాయి.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 12 లక్షలను దాటింది. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పోలీసులు, వైద్యులు వంటి పలురకాల ప్రముఖులను చవిచూసింది. కాగా ప్రస్తుతం జైలులో ఉంటున్న ఖైదీలు 120 మంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జైలులో ఈ ఘటన చోటుచేసుకున్నది.
 
అలాగే వీరితో ఎవరెవరు కాంటాక్ట్‌లో ఉన్నారో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం.దేశవ్యాప్తంగా ఉన్న కరోనా లిస్టులో యూపీ ఆరో స్థానంలో ఉంది.ప్రస్తుతం ఇక్కడ 55,588మందికి కోవిడ్ పాజిటివ్ కేసులుండగా అందులో 1263 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో రాజకీయ పోరు, గెహ్లట్ సర్కారుకు చుక్కెదురు