Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో 49,310 కేసులు

భారత్‌లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో 49,310 కేసులు
, శుక్రవారం, 24 జులై 2020 (11:40 IST)
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా సోకి 740 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 30,061 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు 63.18శాతంగా ఉంది. దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 41లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహంగా నటిస్తూ సెల్ఫీలు.. చేతిలో బీరు బాటిల్ పెట్టి ఫోటో.. ఆపై బ్లాక్‌మెయిల్