Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 169కి చేరిన కరోనా కేసులు... దేశ వ్యాప్తంగా రైళ్ల రద్దు

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:25 IST)
కరోనా వైరస్ ‌(కోవిద్‌-19) ప్రభావం రైల్వేశాఖ మీద కూడా పడింది. దేశంలో నిత్యం లక్షలాది మంది రైళ్లలో పయణిస్తారన్న విషయం తెలిసిందే. దీంతో, వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రైల్వేశాఖ అధికారులు 168 రైళ్లను రద్దు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్చి 20 నుంచి 31 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 
 
ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 169కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 
 
ఒకే రోజులో 475 మృతులు 
ఇటలీలో కరోనా వైరస్‌(కోవిద్‌-19) విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,978 మంది ఇటాలియన్‌లు మృత్యువాత పడ్డారు. గురువారం ఒక్కరోజే ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా 475 మంది మరణించారు. 
 
కాగా, అమెరికాలో 153 మంది, ఫ్రాన్స్‌లో 264 మంది, యూకేలో 104 మంది, దక్షిణకొరియాలో 91 మంది, నెదర్లాండ్స్‌లో 58 మంది, జపాన్‌లో 29 మంది అత్యధికంగా కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 18 వేల 997 కరోనా పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments