Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కరాళనృత్యం.. స్వీయ నిర్బంధంలో సినీ సెలెబ్రిటీలు

కరోనా కరాళనృత్యం.. స్వీయ నిర్బంధంలో సినీ సెలెబ్రిటీలు
, గురువారం, 19 మార్చి 2020 (09:05 IST)
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో కేంద్రంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, విద్యా సంస్థలతో పాటు.. 144 సెక్షన్‌ను సైతం అమలు చేస్తోంది. దీంతో ఈ వైరస్ దెబ్బకు ప్రజలంతా భయంతో వణికిపోతూ, బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. ఈ కోవలో తొలుత బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ తన ఇంట్లోనే ప్రత్యేక గదిలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అలాగే, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా స్వచ్చంధంగా నిర్బంధంలోకి వెళ్లారు. 
 
తన చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర ఉన్న ఫొటోను అమితాబ్ ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి పంచుకున్నారు. కరోనా లక్షణాలు గుర్తిస్తే బయటకు రాకండి, వైద్యులను సంప్రదించండి అని పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్‌ ‘క్యారంటైన్‌ తొలి రోజు’ అంటూ స్విమ్మింగ్‌ఫూల్‌లో సేదతీరుతున్న ఫొటోలనుపంచుకున్నది. ప్రణీత స్వీయ నిర్బంధపు సమయంలో వర్కవుట్స్‌కు మాత్రం దూరం కాలేదు. యోగా చేస్తూ కనిపించింది. యోగా రోగనిరోధకశక్తిని పెంచుతుందని ప్రణీత చెప్పింది.
 
టాలీవుడ్ హీరో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం జార్జియా వెళ్లిన ప్రియదర్శి ఇటీవలే ఇండియా వచ్చారు. కరోనా స్క్రీనింగ్‌ను పూర్తిచేసుకున్న ఆయన తనకు తాను క్లీన్‌చీట్‌ ఇచ్చుకోవడం కోసం 14 రోజులు ఇంట్లోనే  ఉంటానని వెల్లడించారు. శ్రద్ధాదాస్‌ క్యారంటైన్‌లోనే ఉన్నానని పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.4 కోట్లిస్తే వస్తానంటున్న 'జిగేల్ రాణి'