Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లక్షకు చేరువైన పాజిటివ్ కేసుల - కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రికి కరోనా

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:15 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరింది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా లక్షకు చేరువైంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 90,928 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం వెల్లడించిన కేసులతో పోల్చితే రెట్టింపు అయ్యాయి. 
 
గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో మొత్తం 90928 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19206 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 285401 కరోనా కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. ఈ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009గా ఉండగా, ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,82,876గా వుంది. 
 
అలాగే, ఈ కరోనా రోగుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్‌ కూడా ఉన్నారు. ఆమెకు కూడా కోవిడ్ వైరస్ సోకింది. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉన్నారు. తనను కలిసినవారంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments