Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ వ్యాప్తంగా 15-18 యేళ్ల లోపు యువతకు వ్యాక్సినేషన్ ప్రారంభం

Advertiesment
Vaccination
, సోమవారం, 3 జనవరి 2022 (13:16 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 15-18 యేళ్ల లోపు చిన్నారులకు కరోనా  వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసి, టికా వేస్తారు. 
 
పెద్దలకు ఇచ్చినట్టుగానే చిన్నారులకు కూడా రెండు డోసుల టీకాను ఇవ్వనున్నారు. మొదటి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ టీకా వేస్తారు. టీకా వేసుకునేవారిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే అధికంగా ఉన్నారు. 
 
దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ, చిన్నారులకు కరోనా టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, పిల్లల ఆధార్ కార్డు, ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకుని రావాలని వారు కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం... వైకాపా నేతల అరాచకం