Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కోరల్లో మహారాష్ట్ర : ముంబైలో 200 మంది వైద్యులకు కరోనా

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:04 IST)
మహారాష్ట్ర కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. కరోనా థర్డ్ వేవ్ మొదలుకావడంతో ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా విలయతాండవం దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొనసాగుతోంది. ఈ మహానగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
 
గత మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 230 మంది వైద్యులకు ఈ వైరస్ బారినపడ్డారు. వీరంతా రెసిడెంట్ వైద్యులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి ప్రెసిడెంట్ గణేశ్ సోలంకి వెల్లడించారు. అలాగే, థానేలో కూడా ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. అదేవిధంగా బ్రిహిన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆరుగు ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన ఉద్యోగుల సంఖ్య 60కి చేరింది. 
 
కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 26538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబై మహానగరంలోనే 16166 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరవ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,76,032కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,505 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments