రెడ్ జోన్‌లో పనిచేశారు, కరోనా అంటిచుకున్నారు, 10 మంది ప్రభుత్వ ఉద్యోగులకు...

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (23:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అయినా సరే ప్రజల్లో మాత్రం భయం తగ్గడం లేదు. ఎపిలో అయితే రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 
 
చిత్తూరు జిల్లాలో అయితే నిన్నటివరకు 28 కేసులు మాత్రమే ఉండగా ఈరోజు ఏకంగా 58కి చేరింది. ఒక్క శ్రీకాళహస్తిలో 25 కేసులు రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. శ్రీకాళహస్తిలో రెడ్ జోన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ సిబ్బందికే కరోనా సోకడం కలకలంగా మారుతోంది. 
 
ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన ముస్లింలతో ఇప్పటికే కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అదే పరిస్థితి. అయితే ముస్లింలను ఆసుపత్రులకు తరలించి.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి.. ప్రజలెవరూ బయట తిరగకూడదని ప్రభుత్వ సిబ్బంది సూచనలిచ్చారు.
 
శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం సిబ్బందితో పాటు పోలీసులు, వాలంటీర్లు ఇలా 10 మందికి కరోనా సోకింది. అంతేకాదు ఇద్దరు మెడికల్ షాపు యజమానులకు కరోనా వచ్చింది. దీంతో వీరందరనీ ఐసోలేషన్‌కు తరలించారు. ఒక్కసారిగా 25 పాజిటివ్ కేసులు నమోదవడంతో శ్రీకాళహస్తి ఉలిక్కిపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments