Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోటికి చేరువైన కరోనా కేసులు..

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:54 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,13,831 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,44,789 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు.
 
కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 338 మంది బాధితులు మరణించగా, 31,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 
 
దేశంలో రికవరీ రేటు 95.31 శాతంగా ఉందని, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్‌ కేసులు 3.24 శాతంగా ఉన్నాయని తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారిలో ఐదు రాష్ట్రాల్లోనే 55 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ఎక్కువగా ఉన్నారని తెలిపింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments