Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?
, గురువారం, 17 డిశెంబరు 2020 (17:29 IST)
Redmi 9 Power
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ9 పవర్ మొబైల్ భారత్‌లో గురువారం విడుదలైంది. శాంసగ్ గెలాక్సి ఎం11, వీవో వై20, ఒప్పో ఏ53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకువచ్చింది. రెడ్ మీ 9 పవర్ 4జీబీ రామ్ ప్లస్ 64 ధర రూ.10,999 కాగా, 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫెర్రీ రెడ్, మైటీ బ్లాక్ దీనిని కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమేజాన్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.
 
స్పెసిఫికేషన్లు.. 
ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్‌ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశం.. ప్రధాని షేక్ హసీనా