Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నా.. వైద్యుడికి పాజిటివ్.. ఎక్కడ..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:28 IST)
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా పాజిటివ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. రెండో డోసు తీసుకున్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇలాంటి కేసు నమోదైంది. రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత చిలుకలగూడ రైల్వే డిస్పెన్సరీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం సృష్టిస్తోంది.
 
బాధితుడిలో వున్నది యాక్టివ్ వైరసా.. లేదా ప్రాణాంతకమైందా అనే కోణంలో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటు వైరస్‌ నిర్ధారౖణెన వైద్యుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబీకులు, సహోద్యోగులకు పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్‌ రావడం విశేషం. కాగా సదరు వైద్యుడు జనవరి మూడో వారంలో తొలి విడత.. తొలి డోసులో ‘కోవిషీల్డ్‌’వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత 28 రోజులకు అదే కంపెనీ వ్యాక్సిన్‌ను రెండో డోసు తీసుకున్నాడు. 
 
ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అయితే జలుబు, జ్వరంతో బాధ పడుతుండటంతో ఇటీవల పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. నిజానికి రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో యాంటీబాడీలు వృద్ధి కావాల్సి ఉంది. కానీ ఆ వైద్యుడికి ఆ నిర్దేశిత గడువు ముగిసినప్పటికీ కోవిడ్‌గా తేలింది. 
 
దీంతో వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి టీకా తీసుకున్న 90 రోజుల వరకు రిస్క్‌ ఉంటుందని, అప్పటివరకు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిందేనని, తయారీ కంపెనీలతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ పదే పదే స్పష్టం చేస్తూనే ఉంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తూనే వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments