Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకు నచ్చిన మార్చి.. ఈ ఏడాది కూడా అదే తంతు.. 32 మంది ఆటోవాలాలకు పాజిటివ్

కరోనాకు నచ్చిన మార్చి.. ఈ ఏడాది కూడా అదే తంతు.. 32 మంది ఆటోవాలాలకు పాజిటివ్
, బుధవారం, 24 మార్చి 2021 (09:21 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గతేడాది మార్చిలోనే కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది కూడా మార్చి నెలలోనే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో సూపర్ స్పైడర్ కేసులు బయటపడ్డాయి. 
 
ఆటోవాలాలకు కరోనా టెస్టులు నిర్వహించగా ఒకేసారి 32 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ జరిగింది. దీంతో సూరత్ మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆటోడ్రైవర్ల కాంటాక్ట్ లిస్ట్ ను ట్రేస్ చేసే పనిలో పడిపోయారు. 
 
ఆటోడ్రైవర్లు, దుకాణదారులు, కూరగాయల వ్యాపారాలు చేసుకునేవారికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. దేశంలో సెకండ్ వేవ్ సమయంలో సూరత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
అలాగే ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33వేల 634 శాంపిల్స్‌ను పరీక్షించగా 492 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజే 168 కేసులు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జిల్లాలో 63 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 56, గుంటూరులో 47, విశాఖపట్నంలో 46 అనంతపురంలో 29 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8లక్షల 94వేల 536కి పెరిగింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్‌లో డిస్కో డ్యాన్సర్‌కు ఝులక్ ఇచ్చిన కమలనాథులు!