2 లక్షల దొంగ ఓటర్ కార్డులున్నాయి, బయట పెడతాం: బిజెపి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (20:00 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో సమానంగా పోటీకి సిoద్ధమైంది బిజెపి. బిజెపి నుంచి ఇప్పటివరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రం తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలోనే మకాం వేసి నేతలందరినీ కలుపుకుని సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. 
 
అందరిని ఐక్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పార్టీ జాతీయ కార్యదర్సి సత్యకుమార్‌లు తిరుపతిలో ఈ రోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.
 
అందులో భాగంగా 2 లక్షల నకిలీ ఓటర్ కార్డులను తయారుచేసిందని దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. రెండురోజుల్లో ఎస్ఈసిని కలుస్తామన్నారు సత్యకుమార్. అంతేకాదు టిడిపి.. వైసిపి ఒక్కటై బిజెపిపై కుట్ర పన్నేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
 
రైల్వేప్రాజెక్టులు, సాగరమాల, కోవిడ్ సమయంలో రాష్ట్రానికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామన్నారు. 5 లక్షల 23 వేల 500 కోట్ల నిధులు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. బిజెపిని రాష్ట్రంలో గెలిపించకపోయినా అభివృద్ధిలో లోటు చేయలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments