Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్దాయన పర్యవేక్షణ, ఎన్ని లక్షల మెజారిటీ తెలుసా?

తిరుపతి ఉప ఎన్నికల్లో పెద్దాయన పర్యవేక్షణ, ఎన్ని లక్షల మెజారిటీ తెలుసా?
, బుధవారం, 24 మార్చి 2021 (19:17 IST)
పార్టీకి ఒక పెద్దాయన ఉంటారు. తెలిసిందే. ఒక్కో పార్టీకి ఒక్కొక్కరు ఉంటారు. ప్రస్తుతానికి వైసిపికి పెద్ద దిక్కు.. పెద్దాయన వై.వి.సుబ్బారెడ్డి. ప్రస్తుత టిటిడి ఛైర్మన్. ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. అది కూడా తిరుపతి ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు సుబ్బారెడ్డిని ప్రత్యేక పర్యవేక్షణ కోసం నియమించారు. తిరుపతిలో ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్ళాలని సూచించారు.
 
అంతేకాకుండా ఈ నెల 29 తేదీ వైసిపి అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ వేస్తున్నారని.. ఆ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నామినేషన్‌కు తరలివచ్చి పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలకు సహరించాలన్నారు. 
 
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని.. ప్రచారం ఆ విధంగా కొనసాగించాలంటున్నారు. 5 లక్షలకు పైగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. గతంలో వైసిపి అభ్యర్థికి 2 లక్షల 70 వేల మెజారిటీ వచ్చిందని.. కానీ ఆ మెజారిటీ కన్నా డబుల్‌గా రావాలన్నారు సుబ్బారెడ్డి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ హాస్టల్ విద్యార్థుల్లో 175 మందికి కరోనా