Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా అమ్మా, సోడా తాగండి, ఓటు వేయండి, మాజీ కేంద్రమంత్రి చింతా

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (19:38 IST)
తిరుపతి ఉప ఎన్నికల్లో అందరి కన్నా వెరైటీగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్. కాంగ్రెస్ పార్టీ అసలు ఇంతవరకు అభ్యర్థినే ప్రకటించకపోయినా తనకు తానుగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఆరుసార్లు ఎంపిగా పనిచేసిన అనుభవంతో పాటు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు చింతా మోహన్.
 
దీంతో ఈసారి కూడా తనకే సీటు వస్తుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. చింతామోహన్ తిరుపతి నగరంలో వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఇస్త్రీ చేస్తున్న వారి దగ్గరకు వెళ్ళి ఇస్త్రీ చేస్తూ.. అలాగే తోపుడు బండ్ల దగ్గరకు వెళ్ళి పండ్లను అమ్ముతూ... వేసవి కాలం కావడంతో చల్లటి మజ్జిగ, లెమన్‌ను అందరికీ ఇస్తూ వెరైటీ ప్రచారం చేస్తున్నారు. 
 
ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా కార్యకర్తలు లేకపోయినా, ఆయన ఒంటరిగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో జరిగిన అభివృద్థిని వివరిస్తూ.. బిజెపి, వైసిపి, టిడిపిలు అసలు తిరుపతిని ఏమాత్రం అభివృద్థి చేయలేదని చెప్పుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments