Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో కరోనా కలకలం... ఏపీలో కాల్ సెంటర్

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (11:51 IST)
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీకి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
జిల్లాలోని కొత్తపేట మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బండారు వెంకటేస్వర్లుకు కరోనా సోకినట్టు వస్తున్న అనుమానాలపై వైద్య పరీక్షలకు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వెంకటేశ్వర్లుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని ఫోనులో మాట్లాడారు. కోన సీమ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చేందొద్దని, ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 
 
ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సచివాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 0866-2410978 నెంబర్‌కు ఫోన్ చేయవచన్నారు. వెంటిలేటర్లతో ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్టు మంత్రి ఆళ్ళనాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments