Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ : ఇది ఏందిరా బాబు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (12:26 IST)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పట్టణ ప్రజలతో పాటు ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఫంక్షన్ హాల్‌కి బారులు తీరారు.
 
ఈ నేపథ్యంలో ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షల కోసం అక్కడికి చేరుకుంది. క్యూలైన్ పెద్దగా ఉండటంతో చివరి వరకు లైన్లోనే ఉండింది. తన వరకు వచ్చేసరికి కరోనా పరీక్షల కిట్స్ అయిపోయాయని, రేపు రావాలని సిబ్బంది చెప్పడంతో చేసేది లేక ఇంటి ముఖం పట్టింది.
 
కానీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్న ఆ మహిళకు సిబ్బంది నీకు పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో బిత్తరపోయిoది. సోమవారం సుమారు రెండు వందల మందికి పైగా కరోనా పరీక్షలు చేయగా సుమారు 48 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే 50 మందిలో చిలకమర్రి గ్రామానికి చెందిన మహిళ పేరు ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
 
అసలు ఆ మహిళకు పరీక్షలు నిర్వహించకుండా కరోనా పాజిటివ్ అని ఎలా నిర్ధారించారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పటికే షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 240 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments