Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...

లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...
, సోమవారం, 20 జులై 2020 (14:49 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలో రెండు నెలల పాటు లాక్డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, పలు ప్రాంతాల్లో ఈ లాక్డౌన్ సమయంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. అలాంటి ఘటన ఒకటి నోయిడాలో జరిగింది. లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం చేశాడు. ఈ విషయం భర్తకు చెప్పినా అతను నోరు మెదపలేదు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ నోయిడాలోని పూర్వాంచల్ హైట్స్ సొసైటీలో నివాసముంటున్న ఓ ఇంటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు గత యేడాది వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తమామలతో కలిసి తాను తన భర్త ఉంటున్నాం. 
 
అయితే, పెళ్ళన కొత్తలో తనపై మామ అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత జూన్ నెలలోనూ మళ్లీ మామ తనపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని తన భర్త, అత్తల దృష్టికి తీసుకెళ్తే ఆయన మిన్నకుండిపోయాడు. 
 
దీంతో సెక్టార్ బేటా 2లోని తన పుట్టింటికి ఆ కోడలు వెళ్లిపోయింది. దీనిపై కోడలి ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498 ఎ, 323, 504, 506, 342 354 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నోయిడా డీసీపీ బృందా శుక్లా చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు డిఎంకె ఎమ్మెల్యేలకి కరోనావైరస్: మొత్తం 17 మంది ఎమ్మెల్యేలకి...