Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్ పరీక్షా తేదీల్లో స్వల్ప మార్పులు...

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు ఉన్నాయి. ఈ మార్పుల ప్రకారంగా ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షలతో పాటు టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 
మరోవైపు, ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments