తెలంగాణ ఎంసెట్ పరీక్షా తేదీల్లో స్వల్ప మార్పులు...

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఎంసెట్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు ఉన్నాయి. ఈ మార్పుల ప్రకారంగా ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
జాతీయ స్థాయిలో జరిగే నీట్ పరీక్షలతో పాటు టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
 
మరోవైపు, ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka: రాకా లుక్ కోసం రోజూ నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని వెచ్చిస్తోన్న అల్లు అర్జున్‌

VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి --ఎం.వెంకయ్య నాయుడు

Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

సింహాలకు మనిషి వెన్ను చూపిస్తే వేటాడుతాయా? ఎదురుగా ముఖం చూపిస్తే పారిపోతాయా?, వీడియో

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments