Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నాయి. గత యేడాది ఈ టెన్త్ పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు. ఈ యేడాది మాత్రం ఆరు పేపర్లకే పరిమితం చేశారు. 
 
సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్, నేచురల్ సైన్స్‌కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరు ఆన్సర్ బుక్‌లెట్స్ ఇస్తారు. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే ప్రీ పబ్లిక్ పరీక్షల రూపంలో ప్రాక్టీస్ చేయించారు. 
 
అయినప్పటికీ విద్యార్థుల్లో నెలకొన్న సందిగ్ధత మాత్రం తొలగిపోలేదు. అనేక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఫిజిక్స్ ఆన్సర్ బుక్‌లెట్‌లో నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు రాశారు. ఇదే పొరపాటు పబ్లిక్ పరీక్షల్లో పునరావృత్తమైతే ఎలా అనే సందేహం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో నెలకొంది. 
 
ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు 18వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, 8న ఇంగ్లీష్, 10న మ్యాథ్స్, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్, 17న కాంపోజిట్ కోర్సు, 18న ఒకేషనల్ కోర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments