Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది...

jagan
, గురువారం, 30 మార్చి 2023 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆకస్మిక ఢిల్లీ పర్యటన గురువారం ముగిసింది. బుధవారం సాయంత్రానికి హస్తినకు చేరుకున్న ఆయన.. అదే రోజు అర్థరాత్రి సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. 
 
వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇందులో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా, గత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు కర్నాటక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చమయం విళక్కు.. స్త్రీ వేషధారణలో ఆకట్టుకున్న పురుషుడు.. ఫోటో వైరల్