Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కొత్తగా 35 కోవిడ్ కేసులు నమోదు.. అంతా పొరుగు రాష్ట్రాల ఎఫెక్టే

corona
, బుధవారం, 29 మార్చి 2023 (12:14 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 35 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో అనుమానిత కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. పొరుగు రాష్ట్రాలలో వందల సంఖ్యలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో COVID-19 కేసులు పెరిగాయి.
 
మంగళవారం ఉదయం నాటికి, రాష్ట్రంలో 35 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎనిమిది కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉన్న డేటా ప్రకారం. రాష్ట్రంలో మంగళవారం కొత్త కేసులు నమోదు కాలేదు. 
 
పొరుగున ఉన్న కర్ణాటకలో 812 యాక్టివ్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 634, తెలంగాణలో 152 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో అనుమానిత కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తెలుగుదేశం ఆవిర్భావ సభ.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం