నేడు #JEEAdvanced2020Exam - రెండు షిప్టుల్లో

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:42 IST)
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ 2020 (JEE Advanced 2020 Exam) ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగనుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. 
 
మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటకు, రెండో షిఫ్టు 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనుంది. ఈ విధానంలో పరీక్ష రాసేందుకు పరీక్షా హాలుకు విద్యార్థులు హాజరయ్యారు. 
 
అయితే, ఈ పరీక్ష కోసం హాజరయ్యే విద్యార్థులకు అనేక నిబంధనల28ను విధించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా తమ వెంట అడ్మిట్ కార్డును తీసుకుని వెళ్లాల్సివుటుంది. ఈ కార్డు లేకుంటే మాత్రం పరీక్షా హాలులోకి అనుమతించరు. 
 
అలాగే, అభ్యర్థులు పెన్ను, పెన్సిల్‌తో పాటు పారదర్శకంగా ఉండే వాటర బాటిళ్లను మాత్రమే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, పరీక్షకు హాజరైన అభ్యర్థులను శరీర ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాతే పరీక్షా హాలులోకి అనుమతించారు. పరీక్ష ముగిసిన తర్వాత జేఈఈ అడ్మిట్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌ను పరీక్షా ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments