Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ ఫలితాలు విడుదల.. అమ్మాయిల్లో తెలంగాణ బిడ్డ టాపర్..

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (15:04 IST)
నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థిని అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ)-2019 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (జూన్ 5) విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో వుంచారు. 
 
ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన మాధురీ రెడ్డి (695 మార్కులు) జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతోపాటు.. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా టాప్-100లో మొత్తం 20 మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 
 
అలాగే నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో రాజస్థాన్‌కు చెందిన ఖందేల్వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు.
 
మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది నీట్(యూజీ) పరీక్షకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా.. 14,10,754 మంది హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments