25న వెల్లడికానున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (18:29 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం విడుదల కావాల్సిన పరీక్షా ఫలితాలను సీబీఎస్ఈ ఈ నెల 25వ తేదీకి వాయిదావేసింది. అలాగే, పదో తరగతి ఫలితాలను కూడా వెల్లడించలేదు. 
 
దీనిపై పరీక్షల కంట్రోల్ సన్యం భరద్వాజ్ స్పందిస్తూ, బక్రీద్ పండుగ కారణంగా గెజిట్‌లో సెలవు రోజు అనీ, కానీ బుధవారం సీబీఎస్ఈ అధికారులకు మాత్రం సెలవు లేదన్నారు. 12 వ తరగతి ఫలితాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. 
 
అదేవిధంగా, సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలను ఖరారు చేసే చివరి తేదీని జూలై  25 సాయంత్రం 5కు పొడిగించింది. గడువు సమయంలోపు ఫలితాల వెల్లడి కోసం పాఠశాలలకు సహాయం చేయడానికి, సిబిఎస్ఇ ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రధాన కార్యాలయంలోని పరీక్షా విభాగం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. 
 
2020లో 10వ తరగతి ఫలితం జూలై 15న ప్రకటించారు. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికే బోర్డు 10వ తరగతి కోసం చాలా పరీక్షలను నిర్వహించింది. అందువల్ల ఫలితాలను ప్రకటించగలిగారు. ఈసారి పరీక్షలు నిరవహించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments