25న వెల్లడికానున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (18:29 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం విడుదల కావాల్సిన పరీక్షా ఫలితాలను సీబీఎస్ఈ ఈ నెల 25వ తేదీకి వాయిదావేసింది. అలాగే, పదో తరగతి ఫలితాలను కూడా వెల్లడించలేదు. 
 
దీనిపై పరీక్షల కంట్రోల్ సన్యం భరద్వాజ్ స్పందిస్తూ, బక్రీద్ పండుగ కారణంగా గెజిట్‌లో సెలవు రోజు అనీ, కానీ బుధవారం సీబీఎస్ఈ అధికారులకు మాత్రం సెలవు లేదన్నారు. 12 వ తరగతి ఫలితాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. 
 
అదేవిధంగా, సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలను ఖరారు చేసే చివరి తేదీని జూలై  25 సాయంత్రం 5కు పొడిగించింది. గడువు సమయంలోపు ఫలితాల వెల్లడి కోసం పాఠశాలలకు సహాయం చేయడానికి, సిబిఎస్ఇ ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రధాన కార్యాలయంలోని పరీక్షా విభాగం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. 
 
2020లో 10వ తరగతి ఫలితం జూలై 15న ప్రకటించారు. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికే బోర్డు 10వ తరగతి కోసం చాలా పరీక్షలను నిర్వహించింది. అందువల్ల ఫలితాలను ప్రకటించగలిగారు. ఈసారి పరీక్షలు నిరవహించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు జరగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

తర్వాతి కథనం
Show comments