Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు..

నేడు సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు..
, మంగళవారం, 20 జులై 2021 (11:00 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. అయితే, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (నేడు) వెలువడనున్నాయి. 
 
మంగళవారం సాయంత్రం ఈ ఫలితాలను ప్రకటించే అవకాశముందని పలు మీడియాలు పేర్కొంటున్నాయి. అయితే.. పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ, కేంద్ర విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 
 
కానీ అంతకుముందు బోర్డు చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం నాటికి ఫలితాలు విడుదల అవుతాయని భావిస్తున్నారు. అయితే.. బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేనప్పటికీ, విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాగ్దాద్ సదర్ మార్కెట్‌లో బాంబు పేలుడు : 35 మంది మృతి