Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త విధానానికి తెర తీస్తోన్న CBSE.. రెండు బోర్డ్ ఎగ్జామ్స్

సరికొత్త విధానానికి తెర తీస్తోన్న CBSE.. రెండు బోర్డ్ ఎగ్జామ్స్
, సోమవారం, 5 జులై 2021 (23:39 IST)
సరికొత్త విధానానికి సీబీఎస్‌ఈ తెర తీస్తోంది. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే... సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సిలబస్‌ ఎడ్యుకేషన్‌ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఇందులో భాగంగానే 2021-2022 అకాడమిక్‌ ఇయర్‌కు గాను రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లను నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇకే బోర్డ్‌ ఎగ్జామ్‌ ఉండడం వల్ల పరీక్షలు రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 
 
టర్మ్‌1, టర్మ్‌ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు.  
 
ఇక సిలబస్‌ విషయానికొస్తే.. రెండు టర్ముల్లో సిలబస్‌ వేరు వేరుగా ఉంటుంది. మొదటి టర్మ్‌ పరీక్షను 50 శాతం సిలబస్‌తో రెండవ టర్మ్‌ పరీక్షను మిగతా 50 శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. పరీక్షల సమయాన్ని 90 నిమిషాలుగా నిర్ణయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏని ర‌ద్దు.. సుప్రీం సీరియస్.. కేంద్రానికి నోటీసులు