Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలో వింత ప్రశ్నలు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (12:46 IST)
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష పశ్నపత్రంలో వింత ప్రశ్నలు వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు అడగటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అమ్మ ఒడి పథకం అమలు తీరును వివరిస్తూ చెన్నైలో ఉండే మీ ఫ్రెండ్‌కి లేఖ రాయాలంటూ పరీక్ష ప్రశ్న వచ్చింది. మొదటి ప్రశ్నగా అమ్మ ఒడి పథకం కింద ఎంతమంది లబ్ధిదారులున్నారు? అర్హత నిబంధనలు, కొత్త పథకం అమలు తీరు ఎలా జరుగుతుందనే అంశాలపై లేఖ రాయాలంటూ పేర్కొన్నారు. 
 
ఈ ప్రశ్నకు ఎస్ఎస్‌సీ బోర్డు 5 మార్కులిచ్చింది. పరీక్ష పత్రంలోని సెక్షన్ 'C'లోనే అమ్మ ఒడి పథకంపై రెండు ప్రశ్నలు ఇచ్చారు. మరో ప్రశ్నగా ఓ దినపత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా ఊహించుకొంటూ మీ స్కూల్‌లో అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వార్తా కథనంగా రాయాలని అడిగారు. ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయాలని పేర్కొన్నారు. 
 
హిందీ, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాల్లో సృజనాత్మక వ్యక్తీకరణ విభాగం కింద అమ్మ ఒడి పథకంపై ప్రశ్నలు ఇచ్చారు. అయితే రెండు ఛాయిస్‌ల్లోనూ ఒకే పథకంపై ప్రశ్నలు రావడంతో వీటిల్లో ఏదో ఒకదానికి సమాధానం రాయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రీఫైనల్ పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు రావటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments