లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గించొచ్చు.. వెల్లడైన 'చిదంబరం' రహస్యం

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ రహస్యం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ఆయన చెప్పిన చిదంబర రహస్యం వల్ల ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.25 వర

Webdunia
బుధవారం, 23 మే 2018 (12:05 IST)
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఓ రహస్యం వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ఆయన చెప్పిన చిదంబర రహస్యం వల్ల ఏకంగా లీటరు పెట్రోల్‌పై రూ.25 వరకు తగ్గించవచ్చట. ఇంతకీ ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం.
 
ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ రూ.82కి చేరింది. వాస్తవానికి ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. అప్పుడు కూడా కేంద్రం ధరలు తగ్గించలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించనప్పుడు కేంద్రం ఒక్కో లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.15 వసూలు చేసింది. దీనికి అదనంగా మరో రూ.10 పన్నుల రూపంలో వాత పెట్టింది. ఈ మొత్తం రూ.25. రెండేళ్ల పాటు దేశంలోని ప్రతి లీటర్ పెట్రోల్ నుంచి ఇలా రూ.25 వసూలు చేసిందని చిదంబరం ట్విట్ చేశారు. 
 
ఇప్పుడు కూడా కేంద్రం తలచుకుంటే.. ప్రజలపై ప్రేమ ఉంటే.. లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గించవచ్చని చిదంబరం సలహా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం అలా చేయటం లేదని.. 2, 3 రూపాయలు తగ్గిస్తూ వాహనదారులను మోసం చేస్తుందంటూ ట్విట్ చేశారు. ఇది కేంద్రానికి ఎంత మాత్రం భారం కాదని వివరించారు. ధర తగ్గినప్పుడు వసూలు చేసిన రూ.15 ఎటూ వాహనదారులకే తిరిగి ఇవ్వొచ్చు అని.. పన్నులు తగ్గించుకుంటే మరో రూ.10 ధర తగ్గుతుందని వెల్లడించారు. చిదంబరం ట్విట్‌తో రహస్యం వీడిందని.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు తగ్గించాలని చమురు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments