Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడ

సీబీఐ కస్టడీకి కార్తి చిదంబరం.... ఇద్రాణి నుంచి రూ.3 కోట్ల లంచం
, గురువారం, 1 మార్చి 2018 (20:20 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర ఆర్థిక మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసులో ఆయనను ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల ఆరో తేదీ వరకు కార్తి వద్ద విచారణ చేయనున్నారు. 
 
నిజానికి లండన్ పర్యటనను ముగించుకుని బుధవారం స్వదేశానికి వచ్చిన కార్తిని.. చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఒక రోజు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. దీనిని గురువారం మరో 5 రోజులపాటు పొడిగించింది.
 
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా వాంగ్మూలాల ఆధారంగా ఆయనను అరెస్టు చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి హోదాలో పి.చిదంబరం చెప్పిన మీదట కార్తి చిదంబరానికి రూ.3 కోట్ల వరకు లంచం చెల్లించినట్లు పీటర్, ఇంద్రాణీ సీబీఐకి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులను దోచుకుని పారిపోయే వాళ్ల కోసం కొత్త చట్టం : కేబినెట్