Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగు రోజుల్లో పెరుగుడుకు విరుగుడు : పెట్రో మంటపై అమిత్ షా కామెంట్స్

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంల

నాలుగు రోజుల్లో పెరుగుడుకు విరుగుడు : పెట్రో మంటపై అమిత్ షా కామెంట్స్
, బుధవారం, 23 మే 2018 (11:54 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది.
 
పెట్రో ధరల పరుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోడీ గట్టెక్కిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. 
 
ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా పేర్కొన్నారు. ఓ చక్కని పరిష్కారంతో మోడీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. మరోవైపు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీకి సిద్ధమయ్యారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుదిరిన పదవుల డీల్.. నేడు కుమార పట్టాభిషేకం.. చంద్రబాబు హాజరు