Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్ ధరలు.. మోడీ కరుణించేనా?

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (11:31 IST)
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ - డీజిల్ ధరలు తీసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుకు వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ విజ్ఞప్తి చేసింది. అలాగే, కొన్ని స్థానిక, రాష్ట్ర పన్నులనూ జీఎస్టీలో విలీనం చేయాలని కోరింది. ఈ మేరకు జీఎస్టీ మండలికి ఓ మెమోరాండంను అసోచామ్ గురువారం అందించింది. 
 
ప్రస్తుతం ఒకే దేశం - ఒకే పన్ను విధానం అమలవుతోంది. దీంతో చాలా వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. కానీ, పెట్రో ఉత్పత్తులను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకునిరాలేదు. గత రెండేళ్లుగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాలైన పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పి జీఎస్టీ పరిధిలోకి తీసుకునిరావాలని అసోచామ్ కోరుతోంది. 
 
విడిగా పన్నులు వేయడం వల్ల వ్యాపార నిర్వహణ ప్రభావితం అవుతున్నది అని సదరు మెమోరాండంలో మండలిని అసోచామ్ కోరింది. అలాగే మండీ పన్ను, స్టాంప్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్‌లనూ జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేసిం ది. ఇది వ్యాపారాల క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుందన్నది. సీజీఎస్టీ, ఐజీఎస్టీ క్రెడిట్ల పునర్వినియోగం, రెస్టారెంట్లు, రియల్టీలకు జీఎస్టీపై వెసులుబాటు అంతర్జాతీయ లావాదేవీలపై పన్ను లెవీపట్ల స్పష్టత, క్రమబద్ధీకరణలనూ మెమోరాండంలో అసోచామ్ ప్రస్తావించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments