Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (11:23 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు చొరవ తీసుకున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు పరుగులు తీయనుంది. గూడూరు - విజయవాడల మధ్య ఇంటర్ సిటీ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ సమ్మతించింది. ఫలితంగా గూడూరు నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ రేలు నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, తెనాలి మధ్య ఆగనుంది. 
 
ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య పలు రైళ్లు నడుసున్నాయి. అయితే, ఇవన్నీ సమయానుకూలంగా లేవన్న విమర్శలు వినొస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు విజయవాడ - గూడూరు మధ్య సరికొత్త ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. ఈ రైలు కేవలం 4.30 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. 
 
ఈ రైలు గూడూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 6.10 గంటలకు బయలుదేరి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా ఉదయం 10.40కి విజయవాడకు చేరుతుంది. ఇదే రైలు విజయవాడ నుంచి (12744) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరుకు చేరుతుంది. ఈ రైలు రేక్‌ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్‌కు అప్పగించారు. ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments