Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య చొరవ : గూడూరు - విజయవాడ మధ్య ఇంటర్ సిటీ రైలు

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (11:23 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు చొరవ తీసుకున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రైలు పరుగులు తీయనుంది. గూడూరు - విజయవాడల మధ్య ఇంటర్ సిటీ రైలును నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ సమ్మతించింది. ఫలితంగా గూడూరు నుంచి విజయవాడకు కేవలం నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ రేలు నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, తెనాలి మధ్య ఆగనుంది. 
 
ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య పలు రైళ్లు నడుసున్నాయి. అయితే, ఇవన్నీ సమయానుకూలంగా లేవన్న విమర్శలు వినొస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు విజయవాడ - గూడూరు మధ్య సరికొత్త ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. ఈ రైలు కేవలం 4.30 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోనుంది. 
 
ఈ రైలు గూడూరు నుంచి ప్రతి రోజూ ఉదయం 6.10 గంటలకు బయలుదేరి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా ఉదయం 10.40కి విజయవాడకు చేరుతుంది. ఇదే రైలు విజయవాడ నుంచి (12744) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గూడూరుకు చేరుతుంది. ఈ రైలు రేక్‌ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్‌కు అప్పగించారు. ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments