Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెఫ్ట్ పేరుతో బాదుడు.. ఆర్బీఈ సరికొత్త ప్రతిపాదన

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (10:14 IST)
బ్యాంకు ఖాతాదారులకు ఇది నిజంగానే దుర్వార్త. ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసుకునేవారి నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని భారత రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ముఖ్యంగా, ఎన్.ఈ.ఎఫ్.టీ ట్రాన్సాక్షన్స్‌కు ఈ చార్జీలను వసూలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. 
 
అయితే, ఈ మట్టి తమ చేతులకు అంటుకోకుండా బ్యాంకు బ్రాంచీల ద్వారా అమలు చేయాలని ఉద్దేశంతో నూతన ప్రతిపాదన చేసింది. ఈ మేరకు 'డిస్కషన్ పేపర్ ఆన్ ఛార్జెస్ ఇన్ పేమెంట్స్ సిస్టమ్స్'లో ఆర్బీఐ ప్రస్తావించింది. నగదు లావాదేవీ విలువ రూ.2 లక్షలు మించితే రూ.25 వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించేందుకు ప్రతిపాదనలో పేర్కొంది. 
 
మరోవైపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిగివున్న ఖాతాదారుల ఆన్‌లైన్ ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించొద్దని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇది సేవింగ్స్ ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు డిస్కషన్ పేపర్ బుధవారం(17 ఆగస్టు 2022)న విడుదల చేసింది. కాగా ప్రస్తుతానికి ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు సంబంధించి బ్యాంకులపై ఆర్బీఐ ఎలాంటి ఫీజులు విధించడం లేదనే విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం