Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం కేసులో విచారణకు డుమ్మా... నిత్యానందకు వారెంట్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (09:54 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ అత్యాచారం కేసులో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో బెంగుళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్‌ను జారీచేసింది. 
 
నిజానికి ఈ కేసులో నిత్యానంద స్వామిని విచారణకు రావాల్సిందిగా గత 2019లోనే కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన అప్పటి నుంచి డుమ్మా కొడుతూ వచ్చారు. పైగా, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో బాధితులు కోర్టుకు తమ ఆందోళన తెలియజేశారు. ఫలితంగా నిత్యానందకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీచేసింది. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం నిత్యానంద కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ కైలాస దేశం ఎక్కడ ఉన్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈక్వెడార్‌ సమీపంలోని ఓ చిన్న దీవిని నిత్యానంద కొనుగోలు చేసి, దానికి కైలాస దేశం అని పేరు పెట్టారు. 
 
ఈ వార్తలను ఈక్వెడార్ దేశం ఖండించింది. మరోవైపు, నిత్యానంద స్వామి ఎయిడ్స్ వ్యాధి కారణంగా చనిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇటీవల ఓ వీడియో ద్వారా తాను ఇంకా జీవించివున్నట్టు, వైద్య చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments