Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు : సచివాలయంలో గేదెల నిర్బధం - గ్రామస్తుల ఆగ్రహం

Buffaloes
, మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గేదెలను సచివాలయ సిబ్బంది నిర్బంధించారు. దీంతో గుంటూరు జిల్లాలోని ఏటూకూరు సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేదెలతో సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని సచివాలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 
 
పైగా, ఈ గేదెలను గత రెండు రోజులుగా నిర్బంధించడంతో వాటికి గడ్డి, నీరు ఏం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ఎవరైతే గేదెలను తీసుకొచ్చారో వారే అక్కడకు తోలుకొచ్చి వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏటుకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న గేదెలతో ఇబ్బంది పడుతున్నట్టు నగర పాలక సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. గత యేడాది కాలంగా అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నాడు. వారు స్పందించకపోవడంతో చివరకు కోర్టును కూడా ఆశ్రయించాడు. 
 
అయితే, ఈ గేదెల వ్యవహారంపై తరుచుగా ఫిర్యాదు రాడంతో శానిటరీ సూపర్‌వైజర్ వెంకటేశ్వర రావు స్పందించారు. రైతు శ్రీనివాస్‌కు చెందిన గేదెలను తోలుకుని సచివాలయానికి వెళ్లి నిర్బంధించారు. ఇక్కడ సచివాలయ సిబ్బంది చిన్నపొరపాటు చేశారు. గేదెను మాత్రం తోలుకొని వెళ్లి, దూడను మాత్రమే అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో సచివాలయ సిబ్బందికి గ్రామస్తులకు వివాదం చెలరేగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ భార్యను ఒత్తిడి చేసాడని ముక్కు-చెవులు-మర్మాంగం కోసేసాడు