Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీ మోటార్ ఇండియా తిరుపతిలో విక్రయ కేంద్రం ప్రారంభం

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (23:23 IST)
దేశవ్యాప్తంగా కారు కొనుగోలు అనుభూతిని పునర్ నిర్వచించేందుకు తనకు గల కట్టుబాటును చాటిచెబుతూ ఎంజీ మోటార్ ఇండియా నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తన నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది.

 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం ఎస్‌యూవీలకు గల పటిష్ట మార్కెట్ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ, ఈ నూతన కేంద్రం నగరంలోని మరింత మంది కొనుగోలుదారుల ప్రయాణ అవసరాలను తీర్చనుంది. ఈ నూతన షో రూమ్ కొనుగోలుదారులకు లుక్ అండ్ ఫీల్‌ను అందించడమే కాకుండా సంస్థ బ్రిటిష్ వారసత్వాన్ని కూడా ప్రతిబింబించనుంది.

 
నూతన షోరూమ్ ప్రారంభంతో ఈ కార్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 12 టచ్ పాయింట్లను నిర్వహిస్తున్నట్లయింది. 2022 చివరినాటికి ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్యను 18కి పెంచాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఈ బ్రాండ్ భారతదేశ వ్యాప్తంగా 307 టచ్ పాయింట్స్‌ను కలిగి ఉంది.

 
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డీలర్ డెవలప్ మెంట్ డైరెక్టర్ శ్రీ పంకజ్ పార్కర్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మా కొనుగోలుదారులకు చేరువలో ఉండేందుకు రిటైల్ ఉనికిని విస్తరించాలన్న మా ప్రణాళికలకు అనుగుణంగానే ఎంజీ తిరుపతి ప్రారంభించబడింది. ఇది ఇక్కడి కొనుగోలుదారుల విక్రయ, సర్వీస్, విడిభాగాలు, యాక్సెసరీస్ అవసరాలను తీరుస్తుంది’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా ఎంజీ తిరుపతి డీలర్ ప్రిన్సిపల్ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అగ్రగామి, భవిష్యత్ సన్నద్ధక బ్రాండ్‌గా, వినూత్నత, సాంకేతిక చోదిత ధోరణులతో ఎంజీ ఇప్పటికే భారతీయ వాహనరంగంలో సంచలనాలు సృష్టించింది. ఈ బ్రాండ్‌తో అనుబంధం మాకెంతో ఆనందదాయకం. ఎంజీ పటిష్ఠ బ్రిటిష్ వారసత్వం, సాంకేతికతపై దృష్టితో మేం ప్రయోజనం పొందనున్నాం. నెల్లూరు లోని కొనుగోలుదారులకు విశిష్ట వాహన రిటైల్ అనుభూతిని అందించనున్నాం’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments