Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడే బాదుడు.. పెరిగిన వంటగ్యాస్ ధరలు..

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:02 IST)
దేశీయ చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి వంటగ్యాస్‌ ధరను పెంచాయి. గత నెల 25న సిలిండర్‌పై రూ.25 పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.25 భారం మోపాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.819కి చేరింది. ఫిబ్రవరి నెలలో సిలిండర్‌ ధరలను మూడు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఆ నెలలో మొత్తంగా రూ.100 అధికమయ్యింది.
 
కాగా, గతేడాది డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటివరకు వంటగ్యాస్‌పై రూ.225 పెరిగాయి. డిసెంబర్‌ 1న 14 కిలోల సిలిండర్‌ ధర రూ.594గా ఉన్నది. రూ.50 పెంచడంతో రూ.644కు చేరింది. మళ్లీ జనవరి 1న రూ.50 వడ్డించడంతో అది రూ.694కు పెరిగింది. అంతటితో ఆగని కంపెనీలు ఫిబ్రవరి 4న రూ.25 పెంచాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.719కి చేరింది. అదేనెలలో పదిరోజుల వ్యవధిలోనే మరో రూ.50 మేర వినియోగదారులపై భారం మోపాయి.
 
ఫిబ్రవరి 14న రూ.50 పెంపుతో రూ.769 పెరిగింది. చివరగా ఫిబ్రవరి 25న రూ.25 మేర గ్యాస్‌ ధరను అధికం చేయడంతో రూ.794కు చేరింది. తాజాగా మరో రూ.25 వడ్డించడంతో సిలిండర్‌ వెల రూ.819కి పెరిగింది. ఇవాళ ఉదయమే కమర్షియల్‌ గ్యాస్‌పై రూ.95 వడ్డించాయి. దీంతో వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌ ధర రూ.1614కు చేరిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments