Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైలు పట్టాలపైకి 'స్వర్ణ' బోగీలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (12:10 IST)
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు... సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా, స్వర్ణ బోగీలను తయారు చేసింది. వీటిని సరికొత్త హంగులతో, అధునాతనంగా తీర్చిదిద్దారు. 
 
ఈ స్వర్ణ రైలు పెట్టెలను న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆవిష్కరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కోసం తయారు చేసిన వీటిని తొలుత సియాల్దా - ఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. చూడగానే ఆకట్టుకునేలా పెట్టె లోపలి భాగాలను తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన కాంతి కోసం ఎల్‌ఈడీ దీపాలను వీటిలో అమర్చారు. 
 
మరుగుదొడ్లలో దుర్గంధం రాకుండా ఏర్పాట్లు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాష్‌ బేసిన్లను అమర్చారు. రాత్రిపూట కూడా బెర్తుల సంఖ్యలు సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తలుపుల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చారు. మొదటి తరగతి ఏసీ పెట్టెల్లో సులభంగా పైబెర్తులకు చేరుకునేందుకు వీలైన నిచ్చెనలు బిగించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments