Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైళ్లలో ఎకానమీ క్లాస్ బోగీలు.. తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం

రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ప్రయాణంలో ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకానమీ ఏసీ బోగీలను తయారు చేయనుంది. వీటిలో తక్కువ

రైళ్లలో ఎకానమీ క్లాస్ బోగీలు.. తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం
, సోమవారం, 3 జులై 2017 (14:52 IST)
రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ప్రయాణంలో ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకానమీ ఏసీ బోగీలను తయారు చేయనుంది. వీటిలో తక్కువ చార్జీతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది. 
 
ఎక్కువదూరం ప్రయాణించే రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుకొంటూ వస్తున్న రైల్వేలు త్వరలో ఆటోమేటిక్ తలుపులతో కూడిన పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ప్రస్తుతం మూడురకాల ఏసీ-3, ఏసీ-2, ఏసీ-1 కోచ్‌లున్నాయి. వీటికి అదనంగా ఇకపై ఎకానమీ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. 
 
ఈ నాలుగు రకాల్లో ప్రయాణికులు ఏరకాన్నైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, హమ్‌సఫర్, తేజస్ రైళ్లు మాత్రమే పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు కలిగినవి. అయితే వీటిలో బోగీలు తక్కువ. అందుకని ఎంపిక చేసిన రూట్లలో ముందుగా పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకొంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...