Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం పరుగులు.. 10 గ్రాముల పసిడి రూ.90 వేలు.. కిలో వెండి రూ.లక్ష దాటేశాయి...

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (09:37 IST)
దేశీయంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలు దాటింది. అలాగే, కిలో వెండి ధర లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. 
 
దేశీయ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేల మార్క్‌కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేలు దాటింది. ధర పెరుగుదలో పసిడితో పోటీపడుతున్న వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. 
 
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 
 
అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు మేలిమి బంగారం ధర రూ.2983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు పెరిగి పది గ్రాముల స్వచ్ఛమైన ధర రూ.90,450కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments