Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం పరుగులు.. 10 గ్రాముల పసిడి రూ.90 వేలు.. కిలో వెండి రూ.లక్ష దాటేశాయి...

ఠాగూర్
శుక్రవారం, 14 మార్చి 2025 (09:37 IST)
దేశీయంగా బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలు దాటింది. అలాగే, కిలో వెండి ధర లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. 
 
దేశీయ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేల మార్క్‌కు చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.90 వేలు దాటింది. ధర పెరుగుదలో పసిడితో పోటీపడుతున్న వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. 
 
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 
 
అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు మేలిమి బంగారం ధర రూ.2983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు పెరిగి పది గ్రాముల స్వచ్ఛమైన ధర రూ.90,450కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments