పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. ఆల్‌టైమ్ గరిష్టానికి రూ.2500 చేరువలో..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:20 IST)
బంగారం ధరలపై స్టాక్ మార్కెట్ ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పడిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు రెండూ 2 శాతానికి పైగా క్షీణించాయి. 
 
స్టాక్ సూచీలు పతనం కావడంతో మరోవైపు బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి రూ. 2500 చేరువలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో రెండు మూడు రోజుల్లో పసిడి రేటు మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 2 వేల డాలర్ల పైకి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్)లో బంగారం ధర 1.8 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.53,500కు చేరింది. 
 
కాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56,200గా ఉంది. 2020 ఆగస్ట్ నెలలో పసిడి రేటు ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయికి చేరువలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments