Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బొగ్గు గనిలో ప్రమాదం - 14 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:12 IST)
చైనా దేశంలో ఓ బొగ్గుగని కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నైరుతి చైనాలోని గుయిజూ ప్రావీన్స్‌లో జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. 
 
ఇక్కడ ఉన్న బొగ్గు గనుల్లో సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో 25వ తేదీన పైకప్పు కూలిపోయింది. అక్కడ పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకునిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి. 
 
అప్పటి నుంచి ఇప్పటివరకు సహయాక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఈ  బొగ్గు గని నుంచి 14 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమంది ప్రాణాలతో రక్షించారు. 
 
గని ప్రవేశద్వారం నుంచి 3 కిలోమీటర్ల మేరకు పైకప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దతి కావడంత గనిలో చిక్కుకునివున్నవారిని రక్షించడంలో కష్టతరంగా మారింది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments