Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి నెలలో రికార్డు స్థాయిలో బంగారు దిగుమతులు

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:45 IST)
దేశ ప్రజలకు బంగారంపై మక్కువ మరింతగా పెరిగిపోతుంది. ఒకవైపు బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నప్పటికీ వీటి కొనుగోళ్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిల్లో విదేశాల నుంచి బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. ఈ యేడాది మొదటి నెల అయిన జనవరి నెలలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. గత యేడాదితో పోల్చితే ఈ మొత్తం 40.9 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ యేడాదిలో బంగారం ధరలు ఏకంగా 11 శాతం మేరకు పెరిగినట్టు తెలిపింది. 
 
గత యేడాది జనవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇపుడది 2.68 బిలియన్ డాలర్ల విలువకు చేరుకుంది. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు దేశంలోకి 50 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత యేడాది ఇదే సమయంలో ఈ దిగుమతుల విలువ 37.85 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, కొత్త యేడాదిలో పసిడి ధర 11 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.88200గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments